ysrcp-roja-says-rap-with-mlas-journalistsనెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జనచైతన్య యాత్రను ప్రారంభించిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పదునైన పదజాలంతో స్పందించారు. “శాసనసభలోకి జబర్దస్త్ కార్యక్రమంలో ఉండే ఆమె వస్తుంది, రాగానే నడుమంతా ఊపేస్తుంది… ఏందమ్మా ఇది? అని ఎవరైనా అడిగితే, తెలుగుదేశంలో ఎవడన్నా ఒక్కడైనా ఉన్నాడా? అని అడుగుతుంది” ఈ మాటలకు ఎలాంటి అర్ధాలు తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

“ఆ తర్వాత, ‘మేమంతా ఎందుకమ్మా?’ అని ఓ ఎమ్మెల్యే అడిగితే రేప్ చేస్తావా? అని ప్రశ్నించింది. దీంతో, అక్కడున్న వారంతా భయపడిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్లు ఆమెను చుట్టుముట్టారు. ఏందమ్మా ఏంది, నీవు మాట్లాడింది? అని ఓ రిపోర్టర్ అడిగితే, ఏం నువ్వు రేప్ చేస్తావా?” అని ప్రశ్నించింది. ఈ మాటలతో సదరు రిపోర్టర్ కూడా భయబ్రాంతులకు గురికావాల్సి వచ్చింది.

ఈ రాష్ట్ర 70 ఏళ్ల చరిత్రలో ఒక ఆడమనిషి, ఒక లెజిస్లేటర్ మిగతా లెజిస్టేటర్లను పట్టుకుని రేప్ చేసే మగాడు ఉన్నాడా? అని ప్రశ్నించడం ఎప్పుడైనా చూశామా? పంచాయతీ మీటింగుల్లో వార్డు మెంబర్లు కూడా ఇలాంటి భాష మాట్లాడరు, ఆమె నోటి నుండి రేప్ అనే మాట తప్ప మరే మాట రాదని” తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేసారు సోమిరెడ్డి.