cbi raids on raghuram krishnam rajuగత ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్… వలసలతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వీక్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. రాజీనామాలు చెయ్యకుండా ఎమ్మెల్యేలను తీసుకోము అని కమిట్ అయ్యారు కాబట్టి వారిని పార్టీలోకి తీసుకోకుండా వారిని ఇండిపెండెంట్లుగా ఉంచుతున్నారు.

ఇది ఇలా ఉండగా… జగన్ కోరుకుంటున్నారో లేక ఆయనని ఇంప్రెస్ చెయ్యడానికి వెళ్లిన వారే చేస్తున్నారో గానీ… అటువంటి వారంతా చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వంశీ లాంటి అనేక పర్యాయాలు పార్టీ నుండి గెలిచినా వారు కూడా ఇదే పంథాని అనుసరిస్తున్నారు. అయితే తాజాగా అదే పరిస్థితి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎదురుకుంటుంది.

ఆ పార్టీలోని అసంతృప్త ఎంపీ రామకృష్ణం రాజు, ఆ పార్టీ నేతలు మీడియా సాక్షిగా బాహాబాహీ తలపడుతున్నారు. తన పై దాడి ఎక్కువ కావడంతో రఘురామ కృష్ణం రాజు కూడా దాడి తీవ్రతరం చేశారు. తను జగన్ ఫోటో పెట్టుకుని గెలవలేదని… తన బొమ్మ పెట్టుకునే తన ఎంపీ స్థానం కింద ఉన్న ఎమ్మెల్యేలు గెలిచారని ఆయన అంటున్నారు.

ఆ పార్టీ నేతలను మీడియా ముందే దుర్భాషలాడారు కూడా. ఇప్పుడు ఆ పార్టీ నేతలు టీడీపీకి తాము చేస్తున్నది మర్చిపోయి… వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవాలి గానీ ఇలా పార్టీ మీద విమర్శలు చెయ్యకూడదు అని నీతులు వల్లిస్తున్నారు. తాము చేసింది, చేస్తుంది ఇంత త్వరగా మర్చిపోతే ఎలా?