ysrcp mla srikanth reddy counter on tdpఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధికార టిడిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాదు, ‘అవినీతి’పై ఓ చిన్న ‘క్లాసే’ తీసుకున్నారు. ఆరేళ్ళ క్రితం ట్రాక్టర్ ఇసుక 1000 లోపు ఉంటే, ప్రస్తుతం వేలల్లో ఉందని ఇలా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యానించిన శ్రీకాంత్ రెడ్డి ఓ దశలో “మాఫియా” గురించి కూడా ప్రస్తావించారు.

గ్రామగ్రామాన ‘మాఫియా’ను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు పడుతున్నాయి. గ్రామాల్లో అసలు పట్టే లేని చంద్రబాబు ఆ పని ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తుంటే… గ్రామాల్లో చంద్రబాబు ప్రవేశపెడితే, పట్టణాల్లో వైయస్ ప్రవేశ పెట్టారా? జగన్ కొనసాగిస్తున్నారా? అంటూ ఎదురు కౌంటర్లు వేస్తున్నారు.

2004 అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ హయంలో జరిగిన హత్యా రాజకీయాలను ఎటువంటి “మాఫియా”తో పోల్చాలని ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు వేస్తున్న ప్రశ్నలకు తెల్లబోవడం వైసిపీ కార్యకర్తల వంతవుతోంది. ‘అవినీతి, మాఫియా’ వంటి పదాలకు అతి దగ్గరగా సావాసం చేసిన ఘనత “వైయస్” కుటుంబానిదే అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు కోకొల్లలు..!