” విశాఖపట్నం రైల్వే జోన్ కోసం ప్రజలంతా రోడ్డెక్కాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ విశాఖ రండి.. మనం ముగ్గురం పట్టాలపై కూర్చుని రైళ్లను ఆపుదాం. జోన్ ఎందుకు ఇవ్వరో చూద్దాం” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే ఛాలెంజ్ చేసిన విషయం మన అందరికి తెలిసిందే.
దీనిపై వైకాపా నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్కల్యాణ్ చెప్పిన మాటలను నమ్మలేమని ఆయన అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను దేశమంతా తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన పవన్, తీరా అవిశ్వాసం పెట్టిన తర్వాత కనిపించకుండా పోయిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు.
రైల్వే జోన్ కోసం వస్తే జగన్ ను రైలు పట్టాల మీద కూర్చోబెట్టి పవన్ రారని భయమా? జగన్ కూర్చున్న పోలీసులు అధికారులు ఎలాగోలా రైలును ఆపుతారు. ప్రతిపక్ష నేత కొంచెం ధైర్యం చేసి ఉండాల్సింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, జగన్ రాకపోయినా ఒకరే వెళ్ళి రైళ్లు ఆపి జోన్ తేవాల్సింది.