ysrcp-jagan-anna-canteen-viralతెలుగుదేశం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అడ్డంగా విమర్శలు చేయడం తప్ప, అందులోని లోటుపాటులను చెప్తూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించలేని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల బాగా సక్సెస్ అయిన అన్న క్యాంటీన్లపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

కేవలం అయిదు రూపాయలకు నాణ్యతతో కూడిన భోజనాన్ని పెడుతోన్న అన్న క్యాంటీన్లు, రాష్ట్రంలో అనేక మంది పేదల ఆకలిని తీరుస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ‘గేమ్ చెంజర్’గా పిలవబడుతున్న అన్న క్యాంటీన్లలో వైసీపీ అభిమానులు కూడా భోజనం చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖపట్టణంలో జరుగుతుండగా, ఈ పాదయాత్రలో పాల్గొన్న పలువురు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మధ్యాహ్న వేళ భోజనానికి అన్న క్యాంటీలకు విచ్చేయడం విశేషం. ఓ పక్కన జగన్ టిడిపిపై మండిపడుతుంటే, మరో పక్కన పట్టెడన్నం కోసం కార్యకర్తలు అదే టిడిపి ప్రవేశపెట్టిన క్యాంటీన్లలో భోజనం చేయడం జగన్ ను వెనక్కి తగ్గేలా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.