YSRCP followers at eating Anna Canteensరోజూ కోడి కూయగానే వైకాపా నాయకులు కొందరు ప్రభుత్వంపైనా ప్రభుత్వ పధకాల పైనా విమర్శలు కురిపించడం షరా మాములే. ఈ లిస్టులో ఇటీవలే మొదలుపెట్టిన అన్నా కాంటీన్లు కూడా ఉన్నాయి. అయితే తాజాగా అవే అన్నా కాంటీన్ల సాక్షిగా ప్రతిపక్షం పరువు పోయింది. ఫొటోలతో సహా దొరికిపోయారు కూడా.

వివరాల్లోకి వెళ్తే విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఆ పాదయాత్రలో పాల్గొన్న కొందరు యువకులు తమ దగ్గరలో ఉన్న అన్నా కాంటీన్ కు వెళ్లి తమ ఆకలి తీర్చుకున్నారు. వారు జై జగన్ అని ఉన్న టీ షర్ట్ లు ధరించి ఉండటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నవి.

వైకాపా వారినీ అక్కున చేర్చుకుంటున్న అన్నా కాంటీన్ అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలలో నెలకొల్పిన అన్నా కాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం పెడుతుండటంతో వాటికి విశేష ఆదరణ వస్తుంది.