YSR-Congress'-Ploy-to-Foil-Chandrababu-Naidu's-Delhi-Tourకొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన విజయ మాల్యా రాజ్య సభ సభ్యత్వం రద్దు చేసి ఆర్ధిక నేరస్తుడైన విజయసాయిరెడ్డికి ప్రధాని ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. దానికి ప్రతిగా విజయసాయిరెడ్డి చంద్రబాబును చెప్పలేని విధంగా దూషించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకు విజయ్ మాల్యాతో లింకు పెట్టె ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ లండన్ లో చంద్రబాబు విజయ్ మాల్యాను కలిశారా లేదా ?… రాజకీయ విరాళాల రూపంలో విజయ్ మాల్యా నుంచి టీడీపీ రూ.150 కోట్లు తీసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబుపై గుడ్డ కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే టీడీపీపై అనేక విమర్శలు చేసి సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతా అని చెప్పి తప్పుకున్నారు విజయసాయిరెడ్డి. తన మీద టీడీపీ వారు చేస్తున్న విమర్శలకు ప్రతిగా ఇలాంటి అభియోగాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.