ys vivekananda reddy daughter sunitha press meetవైఎస్ వివేకానందరెడ్డి మరణం పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుబాటులో ఉన్న ఆధారాల బట్టి ఇది ఇంటి దొంగల పనే అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు ఇప్పటికే దీని మీద రాజకీయం మొదలు పెట్టారు. ఈ హత్య చంద్రబాబు కుట్రే అని చెబుతున్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేని సంస్థ తో ఈ కేసును విచారణ చెయ్యాలని జగన్ హై కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఉన్నఫళంగా వివేకా కుమార్తె, సునీతను తెర మీదకు తెచ్చారు. ఆమె కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఒక స్క్రిప్టు లో ఇచ్చిన మ్యాటర్ ను చూసి చదవడం విశేషం. “వైఎస్‌ జగన్‌మోహనన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న కోరిక. అందుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా రోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబంలో అందరం కలిసే ఉంటాం,” అని ఆమె చెప్పుకొచ్చారు.

కుటుంబాన్ని ఈ విషయంలోకి లాగవద్దని మీడియాని, రాజకీయ నాయకులని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె పట్ల అందరికీ సానుభూతి ఉన్నా దీనికి కారణం ఎవరు అనేది గ్రహిస్తే మంచిది. ముందు గుండె పోటు అని చెప్పడం వల్లే కుటుంబసభ్యుల మీద అనుమానం మొదలయ్యింది. అదే సమయంలో జగన్, వైకాపా నాయకులు ముఖ్యమంత్రికి, లోకేష్ కి దీనికి లింకు పెట్టి రాజకీయం చెయ్యడం వల్లే వివాదాస్పదం అయ్యింది. మీడియాకు చెప్పే ముందు కుటుంబసభ్యులకు చెప్పుకోవాల్సింది. దానికి తోడు జగన్ ను సీఎంను చెయ్యాలని వివేకా కల అని అసందర్భంగా చెప్పడం కూడా పని గట్టుకుని కొందరికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది.