ys sharmila fires on TRS and kcrఆంధ్రప్రదేశ్ – తెలంగాణల మధ్య జలవివాదాలు పేరిట తెలంగాణ మంత్రులు మరో సారి తమ నోటికి పని చెబుతున్నారు. ఒక మంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దొంగ అంటే… ఆయన దొంగ మాత్రమే కాదు నరరూపరాక్షసుడు అని ఇంకో మంత్రి చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా ఏపీ ముఖ్యమంత్రి మాత్రం తాను మౌనం వహిస్తూ… అలాగే తమ పార్టీ వారిని కూడా అదుపు చేస్తున్నారు.

అయితే సొంత తండ్రి, తన అభిమాన నాయకుడిని ఇన్ని మాటలు అంటుంటే మాట్లాడటం లేదని వైఎస్ అభిమానులు, రెడ్డి సామాజిక వర్గం వారు రగిలిపోతున్నారు. ఈ విషయంలో జగన్ కంటే షర్మిల బెటర్ అనిపించించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, పదిరలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె అధికార పార్టీ పై విరుచుకుపడ్డారు.

రాజశేఖర్ రెడ్డి మహానేత అని, ఆయన్ని కించపరిచేలా కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని వైఎస్ కుమార్తె షర్మిల అన్నారు. వైఎస్సార్ను తిడితే ఊరుకునేది లేదని … వైఎస్సార్కు లక్షల మంది అభిమానులున్నారని, వారంతా టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్తారని ఆమె అధికార పార్టీని వారించారు.

“వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు. ఉప ఎన్నికలు వస్తే బయటకు రావడం, రెండు కామెంట్లు చేసి మళ్లీ ఫాంహౌస్కు వెళ్లిపోవడం కేసీఆర్కు అలవాటుగా మారింది,” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న జగన్ కేసీఆర్ కు దాసోహం అంటే… ప్రతిపక్షంలో ఉండి కూడా చెల్లెలు మెరుగు అనిపించింది అని పలువురు వైఎస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.