ys jagan says he will create history-కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 15వ రోజుకు చేరింది. కొలుములపల్లె నుంచి యాత్ర ప్రారంభం అయ్యింది. ఇప్పటిదాకా నడిచిన 14 రోజుల్లో 196 కిలోమీటర్ల దూరం నడిచారు జగన్ (రెండు రోజుల కోర్ట్ బ్రేక్ తో). యాత్ర సందర్భంగా ఆయన ప్రజలకు అడిగింది లేదనకుండా వరాలు కురిపించారు.

ఒకప్పుడు అలవిగాని హామీలు ఇవ్వను అని చెప్పుకొచ్చే జగన్ ఈసారి మాత్రం తన శైలిని మార్చుకుని అల్ ఫ్రీ అనడం మొదలు పెట్టారు. తాజాగా అని ఆపరేషన్లు ఫ్రీ అని అనౌన్స్ చేసారు. తాను అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో మళ్ళి ఆరోగ్యశ్రీ మొదలు పెడతాను అని ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి.

ఈ సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దేవుడు అవకాశం ఇస్తే హిస్టరీ క్రియేట్ చేస్తా అని చెప్పారు. ప్రజలని ప్రసన్నం చేసుకోవడం కోసం 3000 కిలోమీటర్లు నడుస్తున్న జగన్ ను దేవుడు కరుణిస్తాడో లేదో తెలియాలంటే 2019 వరకు ఆగాల్సిందే.