కాపుల ఐకాన్ వంగవీటి మోహనరంగను విమర్శించారని అప్పట్లో సీనియర్ నేత గౌతమ్ రెడ్డిని పార్టీని నుండి సస్పెండ్ చేసారు జగన్ మోహన్ రెడ్డి. అయితే తరువాతి కాలంలో ఆయనను నెమ్మదిగా పార్టీలోకి తిరిగి తెచ్చారు. తాజాగా ఆయన సస్పెన్షన్ ను కూడా పార్టీ ఎత్తివేసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో ఆ పార్టీ సంతృప్తి చెంది సస్పెన్షన్ ఎత్తేసిందట.
దీనితో వంగవీటి రాధ ఎలా స్పందిస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న విజయవాడలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. దీనితో వంగవీటి వైపే అంతా చూశారు అయితే ఆయనను జగన్ బానే మేనేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. విజయవాడలో జగన్ పాదయాత్ర సందర్భంగా గౌతమ్రెడ్డి పేరుతో పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి.
చిట్టినగర్ సభలో జగన్ మాట్లాడుతున్నంత సేపు వాహనంపై జగన్ పక్కనే వంగవీటి రాధా ఉండగా, గౌతమ్రెడ్డి మాత్రం కిందే ఉన్నారు. ఈ విధంగా జగన్ సమన్యాయం చేసినట్టుగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో వైకాపా తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వంగవీటి రాధ పోటీ చెయ్యడం దాదాపుగా కంఫర్మ్ అయిపోయింది.