young director Buchi babu worried about his futureసుకుమార్ శిష్యుడు… బుచ్చి బాబు సన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కరోనా మొదటి వేవ్ తరువాత టాలీవుడ్ మొదటి 50 కోట్ల షేర్ ఫిల్మ్ ఉప్పెన. వవ యువ దర్శకుడు ఉప్పెన తర్వాత తన తదుపరి ప్రాజెక్టు ఇంకా సంతకం చేయలేదు.

అయితే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే రాసి… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఎన్టీఆర్ దాని మీద ఆసక్తి కూడా కనబరిచాడని సమాచారం. కానీ నిన్న బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో, అతను ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించలేదు. అతను కొరటాల చిత్రం మరియు కెజిఎఫ్ 2 దర్శకుడి (ప్రశాంత్ నీల్) చిత్రం గురించి మాత్రమే ప్రస్తావించాడు.

బుచ్చి బాబు సినిమా మీద ఎన్టీఆర్ కు ఆసక్తి ఉన్నా, అది పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళు పడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. మూడు సంవత్సరాలు అనేది కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడికి చాలా ఎక్కువ సమయం. ఈ విరామంలో ప్రేక్షకులు బుచ్చి బాబు ను మరచిపోయే ప్రమాదం కూడా ఉంది.

కాబట్టి, యువ దర్శకుడు తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతున్నాడట. ఇప్పటి పరిస్థితులను బట్టి ఎన్టీఆర్ కు ఒక మాట చెప్పి… అతను వేరే ఆప్షన్ గురించి ఆలోచిస్తే మంచిది. సుకుమార్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి గురువు గారు ఏదో ఒక ప్రాజెక్ట్ సెట్ చెయ్యకమానరు కదా!