Yadava Community complaint on  Chaganti Koteswara Rao రెండు రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు యాదవుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ యాదవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాగంటిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో నొచ్చుకున్న ఆయన అసలు ప్రవచనాలే మానేస్తే ఈ జంఝాటం ఉండదని భావిస్తున్నారట. తనపై కేసులు పెట్టడంతో చాగంటి మనస్తాపం చెందినట్లుగా, ఏకంగా ప్రవచనాలు చెప్పడం మానేయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టు, ప్రవచనాలు చెబుతోంటే పదే పదే కేసులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నిర్ణయమే తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాగంటి అభిమానులు నిరాశ చెందినట్లే.