Woman Soul leaves her Body after accidentమనిషి మేధస్సుకు అందని విషయాలలో ‘ఆత్మలు’ అనే అంశం కూడా ఒకటి. అనాదిగా మనిషిని వెంటాడుతున్న ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ‘నమ్మకం’ మాత్రమే. మరణం తరువాత ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు, ఎవరి నమ్మకం వారిది. మరణం తరువాత ఆత్మలు స్వర్గం లేదా నరకానికి చేరుతాయని మత గ్రంధాలు స్పష్టం చేస్తే… హేతువాదులు మాత్రం అలాంటివేవీ లేవని, స్వర్గమైనా నరకమైనా జీవించి ఉన్నంత వరకేనని పేర్కొంటూ ఉంటారు.

ఆత్మల గురించిన క్లారిటీ లేని ప్రస్తుత తరుణంలో సీసీ పుటేజ్ కు చిక్కిన ఓ వీడియో యూ ట్యూబ్ లో సంచలనం రేపుతూ వైరల్ గా మారింది. నెమ్మదిగా రోడ్డు దాటుతున్న ఓ కారును వేగంగా వచ్చిన ఓ బైకర్ ఢీ కొట్టాడు. ఈ బైకర్ నేరుగా ఓ స్తంభాన్ని గుద్దుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూసిన పలువురు పరుగుపరుగున అక్కడికి చేరుకునే లోపు ఆ వ్యక్తిలోని ఆత్మ లేచి బయటకు వెళ్ళినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ఫేక్ వీడియో అంటూ దీనిని కొట్టిపడేస్తున్నారు. గ్రాఫిక్స్ సాయంతో దీనిని తయారు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజంగానే ఫేక్ వీడియో అని ఇదే యాక్సిడెంట్ కు సంబంధించిన మరో వీడియో స్పష్టం చేస్తోంది. సాధారణంగా ‘ఆత్మ’ల పైన వీక్షుకులలో అమిత ఆసక్తి ఉంటుంది గనుక, దానిని క్యాష్ చేసుకునేందుకు ఇలా గ్రాఫిక్స్ ను సృష్టించి యూ ట్యూబ్ లో విడుదల చేస్తుంటారు. రియాలిటీకి… గ్రాఫిక్స్ కు ఉన్న తేడా ఏంటో మీరు ఒకసారి వీక్షించండి..!