తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోతుకుపల్లినరసింహులుకు మోడి గవర్నమెంట్ గవర్నర్ పోస్టు విషయంలో మరో సారి మొండి చెయ్యి ఎదురయ్యింది. ఇకపై గవర్నర్ పోస్టు వచ్చే అవకాశం దాదాపుగా లేకపోవడంతో కనీసం రాజ్య సభ పోస్టు మీద ఆయన ఆశ పెట్టుకున్నారు.
ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వచ్చే ఎన్నికల్లో ఇద్దరు చంద్రులు కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయంతో ఈమధ్య వార్తల్లో ఉన్న తెరాస – తెదేపా పొత్తు మాట మరోసారి తెర పైకి వచ్చింది.
నిజంగానే ఆ దిశగా సమాలోచనలు జరుగుతున్నాయా? మోతుకుపల్లి కి దీనిపై ఏమన్నా సమాచారం ఉండే అలాంటి వ్యాఖ్య చేశారా? అనేది చూడాలి. ఐతే రాజకీయ విశ్లేషకులు మాత్రం టీడీపీ తెరాస పొత్తు అంత సులభం కాదని. దాని వల్ల టీడీపీ కి తెలంగాణా లో ప్రయోజనం ఉన్నా దీని వల్ల టీడీపీ ఆంధ్ర రాష్ట్రం లో ఎంతగానో నష్టాపోతుందని అంచనా.