Sye Raa Narasimha Reddy - Saahoఈ ఏడాది విడుదల కాబోతుంది రెండే రెండు పెద్ద చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి సైరా, ప్రభాస్ సాహో. దాదాపుగా రెండేళ్ల నుండి ఈ సినిమాలు షూటింగు జరుపుకుంటున్నాయి. రెండు చిత్రాలలోనూ గ్రాఫిక్స్ ఎక్కువ ఉండటంతో నిర్మాణానంతర కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయమే కావలి. సైరా ఈ ఏడాది అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సాహో ఆగష్టు 15న స్వత్రంత్ర దినోత్సవం సందర్భంగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికీ రెండు సినిమాల షూటింగు పూర్తి కాలేదు. ఇదిగో అదుగో అంటూ ఏదో ఒకరకంగా షూటింగును పెంచుకుంటూ పోతున్నారు. ఈ సమయంలో త్వరగా గుమ్మడికాయ కొట్టండ్రా బాబు అంటూ ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సాహూ మ్యూజిక్ డైరెక్టర్లు తప్పుకోవడంతో కొత్త వారు వచ్చి రెండు పాటలు రెడీ చెయ్యాలి. ఆ రెండు పాటలు షూట్ చెయ్యాలి. అవి పూర్తి అయితే తప్ప సినిమా పూర్తి కాదు. మరో వైపు సైరా షూటింగ్ ఎలాగైనా ఈ నెలాఖరుకి పూర్తి చెయ్యాలని ఆ చిత్రబృందం అనుకుంటుంది.

రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో అభిమానులు ఈ చిత్రాల ఫలితాల పై ఆసక్తిగా ఉన్నారు. సైరా 200 కోట్ల చిత్రమని, సాహూ 300 కోట్ల చిత్రమని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. సైరా హిట్ అయితే బాహుబలి మొదటి పార్ట్ రికార్డులు చెరిపి వెయ్యడం ఖాయమని అభిమానులు అంటున్నారు. అదే సమయంలో సాహూ గనుక హిట్ అయితే ప్రభాస్ జాతీయ స్థాయిలో పెద్ద హీరోగా నిలదొక్కుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ఆశపెట్టుకున్నారు.