ఎంతో వ్యయప్రయాసలకు ఒగ్గి తెరకెక్కించిన “విశ్వరూపం 2” ఎట్టకేలకు ఈ నెల 10వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే కరుణానిధి మరణంతో ఈ సినిమా రిలీజ్ కు బ్రేకులు పడ్డాయి. మాజీ సిఎంపై ఉన్న ప్రేమతో తమిళనాడు వ్యాప్తంగా రెండు రోజుల పాటు ధియేటర్లన్నీ బంద్ నిర్వహిస్తుండడంతో, ‘విశ్వరూపం 2’ వాయిదా పడక తప్పలేదు.

రెండు భాషలలోనూ ఒకేసారి విడుదల చేయాలన్న కమల్ ఆకాంక్షతో తమిళంతో పాటు, తెలుగులో కూడా వాయిదా పడింది. బహుశా ఆగష్టు 15వ తేదీన విడుదల ఉండవచ్చని లేటెస్ట్ న్యూస్. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు గానీ, ఇప్పటివరకు జరుగుతున్న బుకింగ్స్ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే ముందుగా తీసుకున్న టికెట్లను కూడా రిటర్న్ చేసే సదుపాయాన్ని ప్రేక్షకులకు ఇస్తున్నట్లుగా సమాచారం.