Vishnu-Kumar Rajuతెలుగుదేశానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్నారని, వచ్చే నెల 15న కొంతమంది ఆ పార్టీలో చేరే అవకాశం ఉందట. ఈ మాట అన్నది ఎవరో వైకాపా నేత కాదు. అదేంటి వైకాపాలో టీడీపీ ఎమ్మెల్యేలు జాయిన్ అయితే బీజేపీ నేతకు సంబరం ఏంటి అనుకుంటున్నారా? అది ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి.

2019లో జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాదని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఆ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోయిందని, ప్రజల్లో ఆదరణ కోల్పోయిందన్నారు. ఇవన్నీ సరే రాజు గారు అసలు మీ పార్టీ సంగతేంటి? మీ పార్టీ నుండి కన్నా లక్ష్మీనారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి వైకాపాలో జాయిన్ కావడం ఖరారు చేసుకున్నారుగా.

కన్నా అయితే నిన్నటి దాకా పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేత. ఈ నేతలు వెళ్లిపోతున్నారు అంటే 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం లేదని అర్ధం చేసుకోవాలా? అని టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందేమో కదా విష్ణు కుమార్ రాజు గారు!