vijayashanti mahesh babuసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకున్నారు. దీని కోసం చిత్ర నిర్మాతలు ఆమెకు భారీగానే ముట్టచెప్పారట.

అక్కడితో ఆగకుండా ఆమె వల్ల వారికి ఇంకో పెద్ద ఖర్చు పడిందట. సినిమా సైన్ చేసేటప్పుడే ఆమె హైదరాబాద్ ధాటి షూట్ చెయ్యను అని చెప్పేశారట. అయితే సినిమాలో ఆమె ఉండే ఇల్లు రాయలసీమలో ఉంటుందంట. దానితో చేసేదేమీ లేక హైదరాబాద్ నగర శివార్లలో 30 ఎకరాల ఫార్మ్ హౌస్ ను లీజ్ కు తీసుకుని ఒక బంగ్లా సెట్ వేశారట.

దానిని ఆనుకుని ఒక జొన్న తోట కూడా కృత్రిమంగానే సృష్టించారట. వీటి అన్నిటికీ చిత్రబృందం భారీగానే ఖర్చు పెట్టిందట. ప్రస్తుతం ఈ సెట్ లోనే సినిమా షూటింగ్ జరుగుతుంది. పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది.

ఈ మధ్య కాలంలో సీరియస్ మెస్సేజ్ సినిమాలే తీస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో తన పంథా మారుస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ చేసిన ‘ఖలేజా’, ‘దూకుడు’, ‘ఆగడు’ సినిమాల్లో కామెడీ ప్రధాన భూమిక పోషించింది. ఇప్పుడు ఇది కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో మహేశ్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు