Vijayasai Reddyమాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం ప్రగతిభవన్ గడప కూడా దాటవు అన్న చందాన ఉన్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాటలు/ట్వీట్లు అని సోషల్ మీడియా లో జోకులు వేస్తున్నారు నెటిజన్లు. విజయసాయి రెడ్డి వాడినంతగా వైఎస్సార్ కాంగ్రెస్ లో ట్విట్టర్ ని ఇంకెవ్వరూ వాడరేమో!

సొంత ప్రభుత్వంపై పొగడ్తలు కోసం, ప్రతిపక్ష పార్టీలను తిట్టి పొయ్యడానికి దానిని విరివిగా వాడుతారు. తాజాగా ఆయన కోవిడ్ సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ ఉత్తుత్తివే అని తేల్చేశారు. అదంతా గిట్టని మీడియా, చంద్రబాబు నాయుడు సృష్టి అని చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ లో అంతా సూపర్ గా ఉందని చెప్పుకొచ్చారు.

“టీవీల్లో కనిపించే సామూహిక శవ దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోనివి కావని ఆ తండ్రీకొడుకులు బాగా తెలుసు. ఇంకో రాష్ట్రాన్ని వేలెత్తి చూపే ధైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారు,” అంటూ లోకేష్, చంద్రబాబుల మీద నెపం వేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో అంతా బావుంటే విజయసాయిరెడ్డి గారికి గత ఏడాది కరోనా రాగానే స్పెషల్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లోని అపోలోల ఆసుపత్రిలో ఎందుకు చేరినట్టు అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న లోటు పాట్లను నోట్ చేసుకుని వాటిని సవరించుకోకుండా రాజకీయాలు చేస్తే అది చనిపోయిన వారినీ కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న వారిని అవమానించినట్టే అని వారు విజయసాయి రెడ్డికి సూచిస్తున్నారు.