Vijayasai Reddy - Nara lokeshవిజయసాయిరెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో నెంబర్ టూ… పెద్దల సభకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి మొదటి ఎంపీ. మాములుగా పెద్దల సభ అంటే ఎంపీలు హుందాగా ప్రవర్తించాలి. అయితే విజయసాయి రెడ్డికి మాత్రం అటువంటి పట్టింపులు ఉండవు. ప్రతిరోజు చీప్ మాటలతో వార్తలకు ఎక్కుతూ ఉంటారు. ఈరోజు ఇంత చీప్ గా మాట్లాడారు ఏంటి అనుకుంటే మరునాడు నిన్నే కొంచెం బెటర్ అనిపించుకుంటారు. తాజాగా ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేష్ పై మరోసారి అటువంటి విమర్శలే చేశారు.

‘డియర్ లోకేష్.. మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా… మాకు మోదీ, కేసీఆర్‌లతో ఏం పని చెప్పు? తప్పమ్మా.. ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!’ అని ట్వీట్‌ చేశారు. “లోకేష్, నీకు జగన్‌ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని ట్వీట్ చేసావు. మోదీ సంగతి తర్వాత ఆలోచిద్దువులే, ముందు నీ బాడీ ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో. మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు”, అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి ఇటువంటి చీప్ వ్యాఖ్యలే కాకుండా చీప్ కార్టూన్లు కూడా ట్విట్టర్ లో పోస్టు చేస్తారు. గతంలో చంద్రబాబు కుటుంబంపై వివాదాస్పద కార్టూన్లు వేసి అరెస్టు అయిన వారిని ఏరికోరి తెచ్చుకుని పనిలో పెట్టుకున్నారట విజయసాయి రెడ్డి. ఆయన వ్యవహారశైలి ట్విట్టర్ లో ఎన్నో సార్లు విమర్శలకు గురైన ఆయన అదే పంథాలో ముందుకు వెళ్తుంటారు. మరో రెండు నెలల పై చిలుకు రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండడంతో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.