వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సభ్యసమాజం సిగ్గుపడే పదజాలంతో తీవ్రంగా దూషించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు…’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నేరగాళ్లందరికీ లీడర్ చంద్రబాబు అని, చార్లెస్ శోభరాజ్ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేగాక టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని, రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారని, మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్లను నిర్వహిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమ్మగారి మీద ఇటువంటి అనుచితవ్యాఖ్యలే చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. ఇటీవలే నంధ్యాల ఉపఎన్నికలలో కూడా జగన్ చంద్రబాబు మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో అక్కడి ఓటర్లు వైకాపాకు గట్టిగా బుద్ది చెప్పారు. అయినా వైకాపా వైఖరిలో మెరుపు వచ్చినట్టుగా కనిపించడంల్లేదు.