వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, విజయసాయి రెడ్డి ట్విట్టర్ అకౌంట్ ను ఆయనే మెయింటైన్ చేస్తారో లేక ఎవరితోనైనా మెయింటైన్ చేయిస్తారో తెలీదుగానీ… ఆయన ట్వీట్లు చాలా చిత్రంగా ఉంటాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా కంట్రోల్ చర్యల మీద వేసిన ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది.
“రాష్ట్రానిధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపి దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. WHO కూడా ఆరా తీస్తోంది,” అని ఆయన ట్వీట్ చేశారు.
గత 24 గంటల్లో రాష్ట్రంలో 62 కరోనా వైరస్ కేసులు, మరో రెండు మరణాలు నమోదయ్యాయి. ఈ 62 కేసుల్లో కర్నూలు అత్యధికంగా 27 కేసులను నమోదు చేసింది. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసులు 955 వరకు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకూ 29 మంది మరణించారు మరియు 145 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని కరోనా కేసులు తెలంగాణతో సమానంగా ఉన్నాయి. టెస్టులు ఎక్కువగా చేస్తున్న కారణంగా కేసులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా తెలంగాణతో పోల్చితే రికవరీ కేసులు తక్కువగా ఉండటం, మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. నిన్న రాత్రి లెక్కల ప్రకారమే… తెలంగాణాలో 252 రికవరీలు, 25 మరణాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా తెలంగాణ ఏపీ కంటే బెటర్ పొజిషన్ లో ఉంది మరో WHO ఆంధ్రప్రదేశ్ ని సంప్రదించడం ఏంటో. ఇదెక్కడి డప్పు… విజయసాయి రెడ్డి గారూ? అంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.
విజన్ 2020 పేరుతో డప్పు కొట్టుకున్న బాబు రాష్ట్రంలో కనీసం 4-5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉంటే కోవిడ్ నేపథ్యంలో ఎంతో ఊరట దొరికేది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప ఊడబొడిచిందేమీ లేదు. దోచుకునే ఛాన్స్ లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గాలి కొదిలేశాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2020
తానింకా సిఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో మునిగి తేలుతున్నాడట బాబు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహుకరించారని అంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2020
విజన్ 2020 పేరుతో డప్పు కొట్టుకున్న బాబు రాష్ట్రంలో కనీసం 4-5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉంటే కోవిడ్ నేపథ్యంలో ఎంతో ఊరట దొరికేది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సోది తప్ప ఊడబొడిచిందేమీ లేదు. దోచుకునే ఛాన్స్ లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గాలి కొదిలేశాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2020