Vijaya Sai Reddy targets chandrababu -naidu రాజకీయ ప్రచారానికి ట్విట్టర్ ని విజయసాయి రెడ్డి వాడినంత విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులు ఎవరూ వాడరేమో. రోజుకు నాలుగైదు ట్వీట్లు చంద్రబాబుని దుర్భాషలాడుతూ పెట్టకపోతే ఆయనకు పూట గడవదు అనే రేంజ్ లో ఉంటాయి ఆయన ట్వీట్. ఈ మధ్య ఆయనకు దొరికిన టాపిక్ ప్రజలు కరోనా వల్ల భయపడుతుంటే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు.

ప్రతి ట్వీట్ లో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడు అనే అర్ధం వచ్చేలా రాస్తున్నారు. “రాష్ట్రంలో సమస్త ప్రభుత్వ యంత్రాంగం కంటిపై కునుకు లేకుండా కరోనా మహావిపత్తుపై పోరాడుతుంటే పొరుగు రాష్ట్రంలో కూర్చున్న ప్రతిపక్ష నేత కరోనా లెక్కలతో కుస్తీలు పడుతున్నాడు. బురదజల్లుడు రాజకీయాలకు ఇది వేళ కాదన్న కనీస స్పృహ లేకుండా,” అంటూ ఈ రోజు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా చంద్రబాబైన, జగన్ అయినా, ఎవరైనా నాలుగు గోడల మధ్య ఉండాల్సిందే. ఆ గోడలు హైదరాబాద్ లో ఉన్నా, తాడేపల్లి లో ఉన్నా తేడా ఏముంటుంది? ప్రధానమంత్రి నుండి ముఖ్యమంత్రి వరకు బయటకు వెళ్ళకండి అని చెబుతుంటే చంద్రబాబు హైదరాబాద్ రాలేదని బాధ పడుతున్నారు ఎంపీగారు.

పదే పదే చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారు అనడం విజయసాయి రెడ్డి చాదస్తమా? గోబెల్స్ ప్రచారమా? అని టీడీపీ వారు అంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 305 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఇప్పటివరకూ నలుగురు చనిపోయారు.