Pawan Kalyan - Vijaya Sai Reddyపెద్దల సభలో సభ్యుడైన విజయసాయి రెడ్డి ఎందుకనో సోషల్ మీడియాలో ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దారుణమైన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ను డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోదంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

“నిత్య కళ్యాణం గురించి సోషల్ మీడియాలో   ఏమనుకుంటున్నారంటే… సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే” అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యమంత్రి దగ్గర నుండి చిన్న స్థాయి నేతల వరకు పవన్ కళ్యాణ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తమ అధినేత దృష్టిలో పడటానికి అన్నట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
తాజాగా విజయసాయి రెడ్డి కూడా మొదలు పెట్టారు. దీనిపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. విజయసాయి రెడ్డి వైఖరిపై ఇప్పటికే సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈరోజు శుక్రవారం కావడంతో నాంపల్లి సిబిఐ కోర్టుకు విజయసాయి రెడ్డి హాజరు కావాల్సి ఉంది.
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>‘నిత్య కళ్యాణం’ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే… సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే.</p>&mdash; Vijayasai Reddy V (@VSReddy_MP) <a href=”https://twitter.com/VSReddy_MP/status/1195201352801996800?ref_src=twsrc%5Etfw”>November 15, 2019</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>