Vijaya Sai Reddy -జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతితొందర్లొ నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. కాసేపటి క్రితం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రజాసమస్యలపై ఎవరు పోరాడినా సంతోషమేనన్నారు.

అలాగే ప్రజాసమస్యలపై ఎవరు పరిష్కారం చూపినా అభినందించాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 11న విడుదల చేస్తాం అని ప్రకటించిన జనసేనాని బస్సు యాత్ర షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం తిరుమల యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడే ఒక ప్రకటన చేస్తారని అంతా భావించినా ఆయన కొండపైన రాజకీయాలు మాట్లాడాను అంటూ ఆ విషయం దాటవేశారు.

యాత్ర కు స్వరాజ్యయాత్ర అని పేరు అనుకుంటున్నట్టు సమాచారం. మొదటి విడతగా 40 రోజులపాటు స్వల్ప విరామాలతో యాత్ర సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అయినట్టు సమాచారం. సాధారణ ఎన్నికలకు కేవలం ఒక ఏడాది మాత్రమే ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రజలలో విస్తృతంగా పర్యటించాలని అనుకుంటున్నట్టు సమాచారం.