Vijaya Sai Reddy -వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తనదైన శైలిలో తూలనాడారు. బాబు ని ఎవరూ నమ్మరని, నిప్పు విశ్వసనీయత అది అని ,ఆయా పార్టీల జాతీయ నేతలను కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలని టిడిపి ఎమ్.పిలు వాళ్లను వేడుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

నిప్పు డిల్లీకి వచ్చారు కాని పప్పు నాయుడు ఎందుకు డిల్లీ రాలేదని ఆయన ప్రశ్నించారు. పప్పు శుక్రవారం నాడు హైదరాబాద్ వచ్చి సోమవారం నాడు విజయవాడ వెళుతున్నారని, హైదరాబాద్ లో ఆయన ఏమి చేస్తున్నారని విజయసాయి ప్రశ్నించారు. లోకేష్ వారాంతాలలో హైదరాబాద్ వస్తారు నిజమే.

ఆయన కుటుంబం అక్కడ ఉందని అందరికి తెలిసిందే. మరి జగన్ గానీ విజయసాయిరెడ్డి గానీ ఎక్కడ ఉంటున్నట్టు? ఇప్పుడంటే పాదయాత్ర గాని ఎప్పుడూ లోటస్ పాండ్ నుండే కదా జగన్ రాజకీయం. ఇక విజయసాయిరెడ్డి సంగతి అయితే చెప్పుకోనక్కర్లేదు. లోకేష్ కు కనీసం వారానికి 5-6 రోజులైనా అమరావతిలో ఉండే నిబద్ధత ఉంది మీ సంగతేంటి అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే ఏం చెబుతారో ఆయన.