Vijay Deverakonda new movie launch“గీత గోవిందం” సినిమాతో అనూహ్యంగా 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోయిన విజయ్ దేవరకొండ, ఆ తర్వాత వచ్చిన “నోటా” సినిమాతో తీవ్ర నిరుత్సాహానికి గురి చేసాడు. అయితే ఇప్పటికే సెట్స్ పై “డియర్ కామ్రేడ్”తో పాటు మరో రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, “గీత గోవిందం” బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత మొదటిసారిగా ఓ సినిమాకు సైన్ చేసాడు విజయ్.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి అభిరుచి గల సినిమాలకు దర్శకత్వం వహించే క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసా బెల్లెలు కనువిందు చేయనున్నారు.

ఫుల్ గడ్డంతో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ లుక్ మాదిరి కనపడుతోన్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తొలి షాట్ కు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అలాగే టి.సుబ్బిరామిరెడ్డి వంటి పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.