vijay-devarakonda-మరో రెండు రోజుల్లో ధియేటర్లలో ప్రత్యక్షం కానున్న “గీత గోవిందం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్టణంలో జరుపుకోగా, ఈ ఈవెంట్ మొత్తం పైరసీనే హాట్ టాపిక్ అయ్యింది. గుంటూరు వేదికగా సర్క్యూలేట్ అయిన సన్నివేశాలు, చివరికి ఇంటర్నట్ కు ఎక్కడంతో, సదరు పైరసీ లింక్ లను బ్లాక్ చేయడంలో చిత్ర యూనిట్ సభ్యులు తలమునకలై ఉన్నారు.

దీంతో ఈ ఈవెంట్ మొత్తం పైరసీ గురించే చర్చ. ముఖ్యంగా ఎప్పుడూ హుషారుగా కనిపించి, స్టేజ్ పైన అందరినీ అలరించే హీరో విజయ్ దేవరకొండ ఉద్వేగభరితుడై కనిపించాడు. స్టేజ్ పైన రోధించడం ఒక్కటే తక్కువ అన్న రీతిలో… “రెండు, మూడు రోజుల నుండి నా మైండ్ మొత్తం దోXXX, నా పని నటించడం, అది మానేసి క్రింద, స్టేజ్ పైన ఫోన్ లో పైరసీ లింక్ లు చూసుకుంటూ బ్లాక్ చేయమని యాంటి పైరసీ సెల్ వారికి పంపించడం ఏంటి” అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.

‘ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకునే వాళ్ళందరికీ చెప్పదలచుకున్నది ఏమిటంటే… మీరెంత నన్ను క్రిందకి లాగాలని చూసినా, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు కావాల్సింది నేను దక్కించుకుంటాను, ఈ నెల 15వ తేదీన ధియేటర్లలోకి వస్తుంది, అప్పుడు మీ స్పందన చూసి నాకున్న డిప్రెషన్ అంతా పోతుంది’ అంటూ తన ప్రసంగం చివరిలో తన అభిమానులను ఉత్సాహపరిచే వ్యాఖ్యలు చేసారు.