Comedian Venu Madhav Meets Minister Talasani‘సై’ సినిమా ‘నల్లబాలు’ కమెడియన్ వేణుమాధవ్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వేణుమాధవ్, తాజాగా నిర్మాతల మండలి సభ్యులు సురేశ్ బాబు, దిల్ రాజులను వెంటపెట్టుకుని తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసారు.

‘తనకు వివిధ రకాల జబ్బులు ఉన్నాయని, త్వరలో చనిపోతానని’ జరుగుతున్న విషప్రచారంపై చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారిని కోరారు వేణుమాధవ్. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసిన వేణుమాధవ్ ఉదంతంపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే, వేణుమాధవ్ ఈ విషయాన్ని తీసుకున్న విధానం చూస్తుంటే… ఎవరో కావాలని వేణుమాధవ్ ను టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నట్లు… వారిని నియత్రించేందుకు వేణుమాధవ్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. లేదంటే వేణుమాధవ్ విషయంలో జరిగిన పొరపాట్లు, గతంలో అంతకు మించిన బడా సెలబ్రిటీల విషయంలోనూ జరిగాయి.

అయితే, వాటన్నింటిని పొరపాట్ల క్రింద ఎవరూ పోలీస్ స్టేషన్ వరకూ కాదు, చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ, ఇక్కడ పరిస్థితి అలా కనపడడం లేదు. పోలీస్ స్టేషన్ కేసుతో వదిలిపెట్టకుండా, ఏకంగా మంత్రి వరకు వెళ్లి చర్యలు తీసుకోవాలని కోరడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా…? అన్న రీతిలో ఆలోచనలు సాగుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ‘బ్యాక్ గ్రౌండ్’లో నిజంగా జరుగుతున్న విషయమేంటి..? అన్న అంశం మిక్కిలి ఆసక్తికరంగా మారింది.