విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’ ఫస్ట్ గ్లిమ్స్ కాసేపటి క్రితం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేశారు. యాక్షన్తోపాటు సరదా సన్నివేశంతో రూపొందించిన ఈ వీడియో అక్కినేని, దగ్గుబాటి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
‘గోదావరిలో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడు’ అనే డైలాగుతో నిజజీవిత మామ అల్లుళ్ళు సినిమాలో కూడా అదే పాత్రలలో సందడి చెయ్యబోతున్నారని అర్ధం అవుతుంది. ముప్పై సెకండ్ల ఫస్ట్ గ్లిమ్స్ తో సినిమా గురించి ఒక అంచనాకు రాలేము గాని, టీజర్ మాత్రం క్యూట్ గా ఉంది. ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ ని బట్టి సినిమాపై ఒక ఐడియా రావొచ్చు.
పండగకు విడుదల చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ నిర్మాతలు తమ రిలీజ్ ప్లాన్ ప్రకటించలేదు. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా, వెంకీకి జోడీగా పాయల్ రాజ్పుత్ నటిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన చివరి పాట రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. నిర్మాణానంతర పనులు కూడా దాదాపుగా పూర్తి అయిపోయాయి.