Venky mama movie to clash with Sye Raa Narasimha Reddy‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కాగా ఈ చిత్రం 25 రోజుల పాటు కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుని ఇప్పుడు నెక్స్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో నడుస్తుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే నాగచైతన్య, రాశి ఖన్నా పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు 75 శాతం వరకు సినిమా పూర్తవుతుందట.

మరోవైపు ఈ సినిమాను అక్టోబర్ 4న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 4న విడుదల సరిగ్గా చిరంజీవి సైరా సినిమా విడుదలైన రెండు రోజులకు. ఒకరకంగా ఇది సాహసమే అని చెప్పుకోవాలి. అయితే రెండు వేరే వేరే జోనర్ సినిమాలు పైగా దసరా సెలవుల వల్ల తమకు కలిసి వస్తుందని వెంకీ మామ నిర్మాతలు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. ఎఫ్2 తో వెంకటేష్, మజిలీతో నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ చిత్రంతో దానిని కొనసాగించాలని అనుకుంటున్నారు.