‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత వెంకటేష్ నటించబోతున్న తర్వాత సినిమా తాజాగా ఫిక్స్ అయ్యింది. మారుతి దర్శకత్వంలో వెంకీ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘రాధ’ అనే చిత్రం రావాల్సి ఉంది. కాని కథ వివాదాస్పదం అవ్వడంతో ఆ సినిమాను వదిలేశారు. తాజాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఆ సినిమానే అని కొందరు అంటున్నారు. అయితే ఆ విషయంలో క్లారిటీ అయితే రాలేదు. కాని తాజాగా ఈ చిత్రానికి ‘రాధకృష్ణ’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో సూపర్ హిట్ను దక్కించుకున్న మారుతి తెరకెక్కించబోతున్న ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా వస్తున్నాయి. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు. గతంలో అనుకున్నట్లుగానే వెంకీకి జోడీగా ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించబోతుంది. మొదట అనుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మారుతి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. చాలా రోజులుగా వెంకీ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా ఎంటర్టైన్మెంట్ను ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.