venkatesh drishyam 2 planning to release on OTTవిక్టరీ వెంకటేష్ ఇటీవలే దృశ్యం 2 షూటింగ్ లో తన భాగాన్ని పూర్తి చేశాడు. కొంత ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. దేశంలో కోవిడ్ రెండో వేవ్ పరిస్థితికి మళ్ళీ థియేటర్లు మూతబడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో సురేష్ బాబు దృశ్యం 2 ను ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫాంపై విడుదల చేయడాన్ని పరిశీలిస్తున్నారు.

అతను మార్కెట్లో ప్రముఖ ఓటీటీ ప్లేయర్లతో సంప్రదించాలని యోచిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మోహన్ లాల్ నటించిన అసలు దృశ్యం 2 (మలయాళం) కూడా దాని థియేటర్ విడుదలను కాదనుకుని నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల అయ్యింది. దృశ్యం 2 దర్శకుడు జీతు జోసెఫ్ ఈ చిత్రానికి మెగాఫోన్‌ను పట్టుకున్నారు.

మీనా, నరేష్ విజయ కృష్ణ, నాడియా, ఎస్తేర్, మరియు కృతిక నటించిన దృశ్యం కు అనుప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రంతో పాటు, వెంకటేష్ ఇంకో రెండు సినిమాలు చేస్తున్నారు. నారప్ప షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఎఫ్3 50% షూటింగ్ పూర్తయ్యింది. ఎఫ్3 ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూడు చిత్రాలు 2021 లో విడుదల కానున్నాయి. దృశ్యం మొదటి భాగం థియేటర్లలో బాగా పే చేసింది… సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే నిరూపించబడిన సబ్జెక్టు కావున ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడుతుందని దగ్గుబాటి అభిమానులు భావించారు. వారు ఈ నిర్ణయంతో నిరుత్సాహపడటం ఖాయం.