varun-tej-injuryశ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ప్రస్తుతం ఊటీలో షెడ్యూల్ జరుపుకుంటోంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం చిత్ర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్న సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ లు కూడా భాగస్వాములు కాగా, ఈ షూటింగ్ లో వరుణ్ తేజ్ గాయపడ్డట్లుగా సినీ వర్గాల టాక్.

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా వరుణ్ తేజ్ కాలుజారి పడిపోగా, చికిత్స అందించిన డాక్టర్లు దాదాపు మూడు – నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారట. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోవాల్సి వచ్చినట్లుగా సమచారం. షూటింగ్ సంగతి పక్కన పెడితే వరుణ్ తేజ్ కు ఎలాంటి పెద్ద ప్రమాదం లేకుండా బయట పడడం చిత్ర యూనిట్ కు ఊపిరి పీల్చుకునేలా చేసిందట. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది.