Vangaveeti-Radha-Take-Back-his-Words-on-TDPనేడు వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా విజయవాడలో స్థానిక హైస్కూల్ వద్ద ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అయితే వంగవీటి రాధ వారందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగ్గు చూపడంతో వారు ముగ్గురూ మొక్కుబడిగా ప్రసంగించి కార్యక్రమం పూర్తికాక మునుపే హడావుడిగా వెళ్ళిపోయారు.

అనంతరం వంగవీటి రాధ మీడియాతో మాట్లాడుతూ, “నిజమే. ఆనాడు నేను, నా అనుచరులు మా నాన్నగారిని టిడిపియే హత్య చేయించిందని పదేపదే వాదించాము. అది ప్రజలలోకి బలంగా వెళ్లిపోయింది కూడా. అయితే మా నాన్నగారికి అన్ని పార్టీలలో అభిమానులు ఉన్నారు. టిడిపిలో నాన్నగారి అభిమానులు కొందరు నన్ను కలిసినప్పుడు, ‘అన్నా… పార్టీలో ఎవరో కొందరు చేసిన తప్పుకి మా అందరినీ నిందించడం… ఆ నిందని మా అందరికీ ఆపాదించడం నీకు తగునా?’ అని ప్రశ్నించినప్పుడు నేను చేస్తున్న తప్పుని గ్రహించాను. నిజమే! ఆరోజు ఆవేశంలో టిడిపిని నిందించాము. కానీ అది తప్పని అర్దమైంది. కనుక బహిరంగంగానే ఆ తప్పునీ ఒప్పుకొని సరిదిద్దుకొంటున్నాను. నాకు పదవులు, అధికారం ఇస్తామని వైసీపీ చాలా ఆఫర్లు ఇచ్చింది. కానీ నేను ఏనాడూ వాటి కోసం అర్రులు చాచలేదు. మా నాన్నగారి ఆశయాల ప్రకారం నా వర్గ ప్రజలకి మేలు