VMR vangaveeti radha devineni nehruవంగవీటి మోహన రంగా 27వ వర్ధంతి సందర్భంగా బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటివరకు కాస్త మౌనంగా ఉన్న వంగవీటి వర్గం, రంగా వర్ధంతి రోజున దేవినేని నెహ్రూకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్ లో దేవినేని నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రంగా తనయుడు రాధ మీడియా ముఖంగా పలు హెచ్చరికలు జారీ చేసారు.

“మా నాయకుడ్ని కోల్పోయి 27 సంవత్సరాలు అయ్యింది, మౌనంగా వున్నాము కదాయని చేతకానితనంగా తీసుకోవద్దని, ఒక కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ ఏమిటో మాకు తెలుసు, అదే మీక్కూడా కావాలంటే మేము సిద్ధం, వెనుకాడే ప్రసక్తే లేదు” అంటూ తీవ్రంగా స్పందించారు. అలాగే, దారిలో ముళ్ళ పొదలు ఉంటే నరుక్కుంటూ వెళ్ళడమే తన సిద్ధంతంగా చెప్పిన నెహ్రూను ప్రస్తావిస్తూ… ఎవరిని నరుకుతావు..? నా తండ్రి మీద 25 హత్య కేసులు ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావు? అంటూ రాజకీయ వాతావరణాన్ని వేడేక్కించారు.

వంగవీటి రాధ నుండి ఒక్కసారిగా వచ్చిన ఈ స్పందనతో రంగా అభిమాన గణం ఉప్పొంగింది. ఇటీవల కాలంలో వంగవీటి వర్గం చాలా నిశబ్దంగా ఉంటోంది. అయితే ఇటీవల టీవీ9 ఛానల్ లో దేవినేని చేసిన వ్యాఖ్యలు వంగవీటి వర్గం ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. దీంతో దేవినేని వర్గానికి ‘రిటర్డ్’ ఇచ్చేందుకు రంగా వర్ధంతిని వేడుకగా ఎంచుకున్నారు. తాజా పరిణామాలతో విజయవాడ పోలీసులు అలర్ట్ అయ్యారు.