vamshi-paidipally-twitter-first-follower-mahesh-babu‘మున్నా’ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన దర్శకుడు వంశీ పైడిపల్లి, ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ కాకపోయినా, రెండో సినిమా “బృందావనం”తో హిట్ అందుకున్నాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఎంత వసూలు చేసింది అన్న దాని కంటే… ‘అప్పటివరకు మాస్ కు మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ ను, క్లాస్ వర్గాలకు, ఫ్యామిలీకి చేరువ చేసేలా ఎంతో స్టైలిష్ గా చూపించాడు’ అన్న పేరును సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత ‘ఎవడు’ సినిమాతో రామ్ చరణ్ కు కమర్షియల్ హిట్ అందించిన వంశీ పైడిపల్లి, ఈ ఏడాది “ఊపిరి” సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో పాటు ప్రిన్స్ మహేష్ బాబును దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ కూడా కొట్టేసాడు వంశీ. పివిపి నిర్మాణంలో ప్రిన్స్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉన్న ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఓ అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనే దానిపై మాత్రం వచ్చే ఏడాదే స్పష్టత రానుంది.

అలాంటి వంశీ పైడిపల్లి ట్విట్టర్ లోకి అడుగు పెట్టాడు. అలా ఎంట్రీ ఇవ్వడంతో మొదటగా ఎవరిని ఫాలో అయ్యారో తెలుసా..? మరెవరో కాదు… తన తదుపరి సినిమాలో హీరోగా నటించబోతున్న ప్రిన్స్ మహేష్ బాబుని. అలా వంశీ పైడిపల్లి ఫాలో అయ్యే వారిలో మొదటి వ్యక్తిగా ప్రిన్స్ నమోదు కాగా, ఆ క్రమంలోనే సమంత, దేవీశ్రీప్రసాద్, నాగార్జున, రాజమౌళి, రానా, జూనియర్ ఎన్టీఆర్, కాజల్, తమన్నా, హరీష్ శంకర్, నాని తదితరులను చేర్చుకున్నాడు.