Telugu-Actress'-Pics-Leaked-Pic-from-Vakeel-Saabపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం… వకీల్ సాబ్ చిత్రం మేలో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సినిమా విడుదలకు ఆరునెలలకు పైగా సమయం ఉంది.

అయితే ఈ లోగా సినిమాలోని ఒక కీలకమైన కోర్టు సీన్ స్టిల్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చిత్రంలో పవన్ కళ్యాణ్, నటి అంజలి కనిపిస్తున్నారు. ఈ సీన్ మొత్తం లీక్ అయ్యిందని కూడా పుకార్లు ఉన్నాయి. ఈ ఉదంతం గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాని గుర్తు చేస్తుంది. అప్పట్లో ఆ సినిమా సగం విడుదలకు ముందే లీక్ అయ్యింది.

దానితో విడుదల తేదీని మార్చాల్సి వచ్చింది. అయినా అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వకీల్ సాబ్ షూటింగ్ దాదాపుగా 70% షూటింగ్ పూర్తి అయ్యింది. పరిస్థితులు చక్కబడ్డాకా మిగతా షూటింగ్ పూర్తి చెయ్యనున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ యొక్క అధికారిక తెలుగు రీమేకైన ఈ సినిమాకు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా కంఫర్మ్ అయ్యిందని వార్తలు వస్తున్నా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. పింక్ లో అమితాబ్ బచ్చన్ ఒక ముసలి లాయర్ గా కనిపిస్తారు. ఆయన ఆరోగ్యం బాలేని సతీమణిని చూసుకుంటూ ఉండే పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ మొత్తం ఘట్టం సినిమాలో మార్చేశారట. పవన్ కళ్యాణ్ కోసం మాస్ బ్లాక్ ఒకటి పెట్టి, ఒక ఫైట్ కోసం పెట్టారట.