కేసీఆర్ను గద్దె దించేందుకు సీట్ల త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. సీపీఐ, టీజేఏస్ కూడా ఆ దిశగా సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ ఎంతతిట్టినా బాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని వీహెచ్ అన్నారు.
చంద్రబాబు త్యాగం చేసారని కితాబు ఇవ్వడం ఆయన మెచ్చు కోవడం మంచిదే. అయితే పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని మీడియా ముఖంగా చెప్పి పార్టీని ఇబ్బంది పెట్టడమేంటో? బీసీలకు సీట్ల కోటాయింపుపై ఢిల్లీలో చర్చలకు తనను పిలవలేదని, రాష్ట్రంలో తనకంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు.
బీసీ సాధికారత కమిటీ ఏర్పాటు చేసి తప్పు చేశారన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని వీహెచ్ స్పష్టం చేశారు. హనుమంతరావు వంటి సీనియర్లు వర్తమాన రాజకీయాలను అర్ధం చేసుకుని మసలుకుంటే వారికీ గౌరవం, పెంచి పెద్ద చేసిన పార్టీకు మంచిది. ఏమంటావు హనుమంతన్న?