మాజీ మంత్రి దానం నాగేందర్ నిష్క్రమణ తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వెళ్తూ వెళ్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి పోవడంతో పార్టీ నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. దీనితో సీనియర్ నేత వి.హనుమంతరావు ను రంగంలోకి దింపింది.
అయితే ఆయన కూడా తనకూ అన్యాయమే జరిగిందని ,అయినా తాను పార్టీని వీడానా అంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే, మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. పిసిసి అద్యక్షుడు అయ్యారు. మూడుసార్లు రాజ్యసభ కు నియమితులయ్యారు. అయినా అన్యాయమే జరిగిందంట.
కారణం ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఆయన చెబుతున్నారు.అయినా తాను పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు. ఏదైనా సమస్య, అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండి పోరాడాలని, పార్టీని వీడటం సరికాదని దానం నాగేందర్ చెప్పే ప్రయత్నం చేసారు.