upreme court rejects bank plea for exchange of `371 crore deposited old notesతమ వద్ద ఖాతాదారులు డిపాజిట్ చేసిన 371 కోట్ల పాత నోట్లను మార్చేలా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని నాసిక్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ పెట్టుకున్న మధ్యంతర పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం, తాము ఈ పిటిషన్ ను తోసిపుచ్చుతున్నట్టు చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

అంతకుముందు నాసిక్ కో-ఆపరేటివ్ బ్యాంకు వాదనలు వినిపిస్తూ, ఇవన్నీ నవంబర్ 8 నుంచి 14 లోపు డిపాజిట్ అయినవేనని, వీటిని తీసుకోకుంటే, లిక్విడిటీ దెబ్బ తిని, తమ 281 శాఖలను మూసేయాల్సి వస్తుందని పేర్కొంది. తమ క్లయింట్ వినతిని మన్నించాలని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ బ్యాంకు తరఫున వాదించారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పాత నోట్ల నిర్ణయంతో ఈ బ్యాంకు మనుగడ ప్రశ్నార్ధకం అయ్యిందనేది లేటెస్ట్ న్యూస్.