Undavalli-Arun-Kumar-ఉండవల్లి అరుణ్ కుమార్ మంచి వక్త అని అందరికి తెలిసింది. ఆయనలోని ప్రత్యేకత ఏమిటంటే తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పి అది నిజం అని అందరిని నమ్మించడం. అసలు రాష్ట్ర విభజన అనేది జరగలేదని, కోర్టు దానిని కొట్టివేస్తుందని అప్పట్లో ఆయన చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే. ఆ తరువాత ఏమైందో కూడా మనకు తెలుసు.

ఇటీవలే చంద్రబాబు అవిశ్వాసతీర్మానం పెట్టాలని, పెడితే బీజేపీలోని అసంతృప్త ఎంపీలు ఓట్లు పడక మోడీ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నట్టు చెప్పుకొచ్చారు కూడా. అయితే తాజా గా ఆయన మళ్ళీ మాట మార్చినట్టుగా కనపడుతుంది.

“అవిశ్వాసం తీర్మానం నిలబడదని తెలిసినా బీజేపీ ఎందుకు చర్చకు జరగనివ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్‌ చొరవ తీసుకోవాలి. లోక్‌సభ వెల్‌లోకి అన్నాడీఎంకే ఎంపీలు దూసుకెళ్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో స్పీకర్‌కు తెలుసు,” అని ఒక ప్రెస్ మీట్ లో ఉండవల్లి చెప్పుకొచ్చారు. మరి ఇదే ఉండవల్లి మోడీ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పారు కదా?