ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అధికార పార్టీ అభ్యర్ధి ముసునూరి దయాకర్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్గాల అంచనా ప్రకారం గతంలో కడియం శ్రీహరికి వచ్చిన మెజారిటీని దాటిపోవచ్చని చెబుతున్నాయి. అంటే దాదాపు 4 లక్షల ఆధిక్యం దక్కుతుందని ఆశిస్తున్నారు. “కారు” స్పీడ్ చూస్తుంటే లక్ష్యాన్ని అందుకునే విధంగానే ఉంది.
ఇక, అంచనా వేసినట్లే కాంగ్రెస్, బిజెపిల మధ్య రెండవ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్ వంటి ప్రాంతాల్లో బిజెపి అభ్యర్ధి దేవయ్య రెండవ స్థానంలో నిలవగా, మిగతా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మరికొన్ని ఏరియాలలో లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉంది. జగన్ పార్టీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనన్న ఫలితాలు వస్తున్నాయి. జగన్ పార్టీ కంటే వామపక్షాలు మెరుగైన స్థానంలో నిలిచాయి. అయితే జగన్ సహకరించిన విధంగానే టీఆర్ఎస్ అభ్యర్ధి ఘనవిజయం దిశగా దూసుకెళ్ళడం ఆ పార్టీకి కొంత ఊరట కలిగించే అంశం.