గడిచిన కొద్దీ గంటలుగా ఓ వీడియో మరియు ఓ ఫోటో సోషల్ మీడియాలో చేస్తోన్న సందడి మామూలుగా లేదు. ఏపీలో రోడ్ల మరమ్మత్తులను ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసన చెప్పే రకాలలో ఇదొక కొత్త రకం కావడంతో, నెటిజన్లు ఈ పోస్టర్ కు ఫిదా అయిపోయారు.
“జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త – ఈ బోర్డు రోడ్డు వేసే వరకు ఎవరైనా తొలగించినచో వారి వారి కుటుంబం ఈ రోడ్ల పైన పోతారు” అంటూ వైసీపీ రంగులతో జగన్ ఫోటోలు ముద్రించిన బ్యానర్ రోడ్డుకు అడ్డంగా ఉంచి తెలిపిన ఈ నిరసన, బహుశా సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం అవుతుందేమో!
గోదావరి జిల్లాలో వెలిసిన ఈ పోస్టర్ ‘గోదారోళ్ళ ఎటకారానికి నిదర్శనంగా నిలుస్తుందంటూ’ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ‘అంతేగా అంతేగా’ అనడం వీక్షించిన వారి వంతు! ఏపీలో రోడ్లు ఎంత దయనీయ పరిస్థితులలో ఉన్నాయో వర్ణించడం బహుశా గోదారోళ్ళకే బాగా వస్తుందేమో!
గోదారోళ్ల ఎటకారం మామూలుగుండదు మరి 🤣 pic.twitter.com/bO1SwvriHY
— 🐎🔱 Sujath 🕉️✝️☪️ (తెలుగుదేశం కుటుంబం) (@SujathRam) December 12, 2021
ఇది ఏంది అయ్యో ఇది🤣🤣😋 pic.twitter.com/eZYrHVLaPn
— Srinivas Kota (@kotasrinumca) December 12, 2021