సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారని ఇప్పటికే తెలిసిందే.
ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని, మరో హీరో పాత్ర కోసం రానాని అనుకుంటున్నట్టు మొన్న ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేదాని మీద క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించవచ్చు అంటున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ తో త్రివిక్రమ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అల వైకుంఠపురములో సక్సెస్ తో ఊపు మీద ఉన్న త్రివిక్రమ్ తన తరువాతి సినిమా ఎన్టీఆర్ తో చెయ్యబోతున్నాడు. కరోనా వైరస్ లొక్డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం అవుతుంది. ఆ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం లేదని కూడా అంటున్నారు.
అదే జరిగితే త్రివిక్రమ్ సమ్మర్ వరకూ ఖాళీనే. ఆలోగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ సినిమాకు మంచి హైప్ వస్తుంది. అలాగే అబ్బాయి ఎన్టీఆర్ కంటే బాబాయ్ బాలయ్యతో సినిమా చేస్తారు త్రివిక్రమ్.