nagarjuna-trivikram-srinivasదసరా కానుకగా అక్టోబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగచైతన్య, శృతిహాసన్ ల ‘ప్రేమమ్’ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ పాజిటివ్ బజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ‘యు/ఎ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ ను అందివ్వనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ వాయిస్ ఓవర్ కు మరింత ప్రాధాన్యత దక్కే విషయమేమిటంటే… నాగార్జున చెప్పే డైలాగ్స్ ను ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందివ్వడం. తాజా సమాచారంతో ‘ప్రేమమ్’పై అక్కినేని అభిమానుల్లో ఉన్న క్రేజ్ మరింత రెట్టింపయ్యింది. నాగార్జున – త్రివిక్రమ్ కాంభినేషన్ లో వచ్చిన ‘మన్మధుడు’ సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలాయో తెలిసిందే. దీంతో మరోసారి త్రివిక్రమ్ డైలాగ్స్ నాగ్ నోటి వెంట రానున్నాయన్న సమాచారం అక్కినేని ఫ్యాన్స్ కు మాంచి బూస్టింగ్ ఇస్తోంది.

గతంలో ‘జల్సా’ సినిమాకు గానూ మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. దీంతో, కింగ్ నరేట్ చేసే స్టోరీ డైలాగ్స్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరో వైపు త్రివిక్రమ్ అభిమానులకు కూడా ఇదొక సర్ ప్రైజింగ్ న్యూసే మరి!