Trisha Krishnan - Chiranjeevi-మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య అనే సినిమాకు త్రిషని హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వారం ఆమె షూటింగ్ లో చేరాల్సి ఉంది. ఆ సందర్భంగా ఆమె పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు త్రిష ఈ సినిమా నుండి తప్పుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది.

త్రిష ఈ సినిమా సైన్ చేసిన సమయంలో గెస్ట్ రోల్ లేదు. ఇప్పుడు రామ్ చరణ్ గానీ మహేష్ బాబు గానీ ఈ పాత్ర చేస్తున్నారు. దానితో ఒక స్టార్ హీరోయిన్ కూడా సినిమాలో ఉండే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో తాను ఈ సినిమాలో నటించడం వల్ల నష్టమే కానీ లాభం లేదని త్రిష భావిస్తుందంట.

దీనితో ఈ సినిమా నుండి తప్పుకోవాలని భావిస్తుందంట. ఒకవేళ అలా జరిగిన పక్షంలో కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని కొరటాల భావిస్తున్నాడట. గతంలో ఆమె చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 లో నటించింది. మెగా అభిమానులు మాత్రం ఇది మంచి పరిణామమే అని, త్రిష కంటే కాజలే బెటర్ అంటున్నారు.

ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు.