Three years for jagan attack drama in vizagమూడేళ్ళ క్రితం అప్పటి ప్రతి పక్ష నేతగా ఉన్న వై ఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో దాడి జరిగింది. ఆ సంఘటన అందరినీ షాక్ అయ్యేలా చేసింది. తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. వెంటనే ఎయిర్ పోర్ట్ నుండి జగన్ హాస్పిటల్ కి వెళ్లడం , అక్కడ రెండ్రోజులు డ్రామా చేయడం తెలిసిందే.

సింపతీ కోసమే జగన్ తన అభిమానితో చేయించుకున్నాడని అప్పటి నుండి టీడీపీ కార్యకర్తలు వాదిస్తూ వస్తున్నారు.ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రతి పక్ష నేత నుండి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు ఈపాటికి ఆ నిందితుడికి శిక్ష పడాలి. అసలేం జరిగిందో ఎవరు చేశారో తెలుసువాలి. కానీ ఇప్పటి వరకూ ఆ కేసులో ఎటువంటి మూమెంట్ లేదు. ప్రభుత్వం కానీ, న్యాయ స్థానంకానీ ఆ కేసు పట్టించుకోవడమే లేదు.

అయితే కోడి కత్తి తో ఈ డ్రామా అంతా జరిగి సరిగ్గా మూడేళ్లవుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో అప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని , జగన్ ని ఎద్దేవా చేశారు.

ఏదేమైనా జస్ట్ కోడి కత్తి ఘాటు తగిలి జగన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు కింద కామెంట్లు పెడుతున్నారు.