‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండవ సినిమా “శ్రీనివాస కళ్యాణం.” నితిన్, రాశి ఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. జయసుధ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో సాగిన ఈ టీజర్ లో…
‘మనం పుట్టినపుడు మనవాళ్ళందరూ ఆనందపడతారు… అది మనకు తెలియదు…. మనం దూరమైనపుడు మనవాళ్ళందరూ బాధపడతారు… అది మనకు తెలియదు… మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్ళందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే, అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిరు ప్రయత్నమే మా శ్రీనివాస కళ్యాణం”గా ఈ టీజర్ ను పేర్కొన్నారు.
సినిమా కాన్సెప్ట్ ఏంటో ప్రేక్షకులను చేరవేయడంలో ఈ టీజర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సహజనటి జయసుధ చేత బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చెప్పించడం హైలైట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో జూలై 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఈ టీజర్ ద్వారా స్పష్టం చేసారు. ఇప్పటికే విడుదలైన ఒక మిక్కీ స్వరం సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.